Header Banner

ఊహించని ఘటన.. భర్తకు తెలియకుండా ఇదేం పనమ్మా.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..

  Sun May 18, 2025 14:11        India

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ రైతు కుటుంబంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దులను అమ్మగా వచ్చిన డబ్బును భర్త ధాన్యం బస్తాలో దాచుకోగా, ఆ విషయం తెలియని భార్య ఆ బస్తాను ఓ వ్యాపారికి విక్రయించింది. తీరా విషయం తెలిశాక లబోదిబోమన్నా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు పోతరాజు వీరయ్య కొన్ని రోజుల క్రితం తన ఎద్దులను అమ్మాడు. వచ్చిన లక్షన్నర రూపాయల నగదును ఇంట్లోని ఓ ధాన్యం బస్తాలో భద్రపరిచాడు. అయితే, ఈ విషయం భార్యకు చెప్పలేదు. గత బుధవారం విడి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి వాహనంలో గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరయ్య భార్య.. భర్త డబ్బులు దాచిన ఆ ధాన్యం బస్తాను ఇతర ధాన్యంతో పాటు ఆ వ్యాపారికి అమ్మేసింది. పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన వీరయ్యకు ధాన్యం బస్తా కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే భార్యను ఆరా తీయగా ధాన్యం బస్తాను వ్యాపారికి అమ్మినట్టు ఆమె తెలిపింది. దీంతో వీరయ్య హతాశుడయ్యాడు. వెంటనే ఆ వ్యాపారి కోసం గ్రామంలో గాలించినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ దంపతులు శనివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. వ్యాపారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia